Friday, September 20, 2024
Homeక్రైంఐసీయూలో చేరిన యువతిపై అత్యాచారం

ఐసీయూలో చేరిన యువతిపై అత్యాచారం

Date:

అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు.

తనకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడని యువతి ఆరోపించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. యువతి మొబైల్‌కి ఆమె భర్త కాల్ చేయడంతో స్పృహలోకి వచ్చిందని, ఆ తర్వాత ఆమెపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించిందని పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అతను బెడ్ పైకి వెళ్లి, అడ్డుగా కర్టెన్లు కప్పి ఉన్న సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తు్న్నామన్నారు.