Monday, October 7, 2024
Homeక్రైంఆసుప‌త్రిలో ఒక‌రిని చంప‌బోయి మ‌రొక‌రిని చంపాడు

ఆసుప‌త్రిలో ఒక‌రిని చంప‌బోయి మ‌రొక‌రిని చంపాడు

Date:

ఒక క్రిమిన‌ల్ ఆసుప‌త్రిలో చేరి పేషేంట్‌గా చికిత్స పొందుతున్నాడు. అత‌డిని చంప‌డానికి ఒక వ్య‌క్తి ఆసుప‌త్రిగా వ‌చ్చాడు. వ‌చ్చిన వ్య‌క్తి క్రిమిన‌ల్‌కు బ‌దులు వేరే వ్య‌క్తిని చంపి వెళ్లాడు. ఆసుపత్రి సిబ్బంది హ‌త్య‌కు ముందురోజే ఆ వార్డులో సదరు బెడ్‌పై ఉన్న క్రిమినల్‌ను మరో వార్డులోని మరో బెడ్‌కు తరలించారు. దాంతో బెడ్‌ నెంబర్‌ గుర్తుపెట్టుకుని వార్డులోకి ప్రవేశించిన హంతకుడు.. ఆ బెడ్‌పై ఉన్న వేరే పేషెంట్‌ను కాల్చిచంపాడు.

దేశ రాజధాని ఢిల్లీలోని జీబీటీ ఆస్పత్రిలో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. ఆ ప్రకారం జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ నేరస్థుడిని హత్య చేసేందుకు అతని శత్రువు ఒకరు హంతకుడిని పంపాడు. పేషెంట్‌ వార్డు, బెడ్‌ నంబర్ వివరాలు తెలుసుకుని హత్యకు ప్లాన్‌ చేశాడు. కానీ అంతకుముందు రోజే ఆ నేరస్థుడిని మరోవార్డుకు తరలించడంతో అతడి స్థానంలోకి వచ్చిన మరో పేషెంట్‌ హత్యకు గురయ్యాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఉన్నతాధికారులు పలు బృందాలను ఏర్పాటు చేశారు. హత్యకు గురైన రోగి 32 ఏళ్ల రియాజుద్దీన్‌గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తిని చంపేందుకు వచ్చి మావాడిని చంపేశారని రియాజుద్దీన్‌ కుటుంబసభ్యులు కూడా బోరున విలపించారు.