Thursday, September 19, 2024
Homeక్రైంఅన్యాయంగా నిండు ప్రాణం తీసిన తాగుబోతు వెధవలు

అన్యాయంగా నిండు ప్రాణం తీసిన తాగుబోతు వెధవలు

Date:

మద్యం మత్తులో అతిక వేగంతో వాహనాలు నడపడం ద్వారా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అదే మద్యంలో రోడ్డుపై కొందరు చేసే అరాచకాల వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.. తాజాగా హైదరాబాద్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ప్రాణాలను తీసింది.. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ అతివేగంతో రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టగా.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్‌ నగర పరిధిలోని గాజులరామారంలో చోటుచేసుకుంది.

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో ఈ ఘటన జరిగింది.. అతివేగం, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో వస్తున్నారు.. ఈ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును కారు ఢీకొట్టింది.. గోపి (38) అనే సెక్యూరిటీ గార్డు స్పాట్ లోనే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.. ఈ ఘోర ప్రమాదం.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది, వారి నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం ఆనాధగా మారింది.. తప్ప తాగి డ్రైవ్ చేస్తున్న యువకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొంతమంది యువకుల్లో మార్పు రావడం లేదు.