టోల్ ఛార్జ్ పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్తో టోల్ బూత్ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై హాపూర్లోని టోల్ బూత్ వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
టోల్ విషయంలో సిబ్బంది, బుల్డోజర్ డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బుల్డోజర్ డ్రైవర్ టోల్ బూత్ను ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుల్డోజర్ డ్రైవర్ కోసం గాలింపు చేపడుతున్నారు. కాగా గతవారం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హాపూర్లో ఓ కారు డ్రైవర్ టోల్ ట్యాక్స్ను తప్పించుకునేందుకు ఏకంగా టోల్ సిబ్బందిపైకే దూసుకెళ్లాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఛిజార్సీలోని టోల్ బూత్ వద్ద సీసీటీవీలో రికార్డైంది.