జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించి మాలాంటి వారిని అరెస్టు చేయడం చాలా అన్యాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నానని కవిత సూచించారు. మంగళవారంతో కవితకు జ్యుడిషీయల్ కస్టడీ ముగియడంతో ఆమెను మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. కవితకు ఈ నెల 14వ తేదీ దాకా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది. ఈ సందర్భంగా కవిత కోర్టు హాలు నుంచి బయటకు వస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల ప్రచారం మొత్తం సెక్స్ స్కాండల్ చుట్టూనే తిరిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బెంగళూరులోని బసవనగుడిలో గల మాజీ ఎమ్మెలే, ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ ఇంట్లో సోమవారం తనిఖీలు నిర్వహించి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకొంది. మరోవైపు ప్రజ్వల్ స్వదేశానికి త్వరలో తిరిగి రావొచ్చనే అంచనాల నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయం వద్ద భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు.