ప్రజలకు రక్షణగా ఉంటూ, ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీస్స్టేషన్లో దొంగతనం జరిగింది. అదే పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తోన్న వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనీ పట్టణంలో జరిగింది. పట్టణ రెండో పోలీసు స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన నగదును బీరువా లాకర్లో భద్రపరుస్తుంటారు. ఆ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు మనోజ్.. పోలీసు అధికారులతో సన్నిహితంగా ఉండేవాడు. దీంతో బీరువా తాళాలు అతడికి ఇచ్చి ఫైల్స్ తీసుకురమ్మని చెప్పేవారు.
ఈ క్రమంలో బీరువాలో ఉంచిన నగదును చూసిన మనోజ్.. అందులోని రూ.5.63లక్షలు కాజేశాడు. ఈ విషయం గుర్తించిన పోలీసులు హోంగార్డుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి రూ.3లక్షల నగదు రికవరీ చేసి, రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు.