అట్టహాసంగా జరుగుతున్న రిలయన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికల పెళ్లి వేడుక జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు పెళ్లికి హజరయ్యారు. కాని ఈ పెళ్లి కార్యక్రమానికి ఆహ్వానం లేకుండా హాజరైన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వారిద్దరూ ఆంధ్రప్రదేశ్కు చెందిన యూట్యూబర్ వెంకటేశ్ అల్లూరి, వ్యాపారవేత్తగా చెప్పుకొంటున్న షఫీ షేక్గా గుర్తించారు. వారిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి.. నోటీసులు ఇచ్చి వదిలేశారు. అయినా, చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.