కేంద్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కు యూపిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపిఎస్సీ (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024) నోటిఫికేషన్ను తన అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో ఈ రోజు ఫిబ్రవరి 14న మధ్యాహ్నం అప్లోడ్ చేశారు. ఈ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ రోజు నుంచే షురూ చేశారు. మార్చి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరణ జరగనుంది. అప్లై చేసిన అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరగనుంది.
యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 14న అనగా ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 21 – 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. సివిల్స్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మే 26న ప్రిలిమినరీ జరగనుండగా.. ఈ పరీక్షకు మూడు వారాల ముందు అడ్మిట్ కార్డ్ను విడుదల చేస్తారు. ఇదిలా ఉండగా.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 150 పోస్టులకు విడిగా మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.