Sunday, September 22, 2024
HomeUncategorizedపేటీఎంపై చర్యలను సమీక్షించేది లేదు

పేటీఎంపై చర్యలను సమీక్షించేది లేదు

Date:

పేటీఎంపై చర్యలను తాము సమీక్షించాలనుకోవడం లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం స్పందించారు. సమగ్ర అంచనా తర్వాతే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిన్‌టెక్‌ రంగానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం. ఆ సమయంలో ఆర్థిక స్థిరత్వం, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం వంటి వాటికి మేం కట్టుబడి ఉంటాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను సమీక్షించే అవకాశం దాదాపు లేనట్లే” అని దాస్‌ వెల్లడించారు. మరోవైపు, పేటీఎం వ్యవహారంపై కేంద్ర బ్యాంక్‌ త్వరలోనే ప్రశ్నావళిని విడుదల చేయనున్నట్లు సమాచారం.

పేటీఎంకు చెందిన పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఇటీవల ఆర్‌బీఐ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామని ఆర్‌బీఐ పేర్కొంది. మరోవైపు, పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై విధించిన ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐను ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ)లు కోరాయి. దీంతో ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం మార్గాలను అన్వేషిస్తోంది.