Saturday, September 21, 2024
HomeUncategorizedపీవీ న‌ర్సింహారావు, చ‌ర‌ణ్‌సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌త ర‌త్న‌..

పీవీ న‌ర్సింహారావు, చ‌ర‌ణ్‌సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌త ర‌త్న‌..

Date:

తెలంగాణ ముద్దుబిడ్డ‌ మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావుకు భార‌త‌ర‌త్నను ప్ర‌క‌టించారు. పీవీ న‌ర్సింహారావుతో పాటు మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌, వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఎంఎస్ స్వామినాథ‌న్‌కు కూడా కేంద్రం శుక్రవారం భార‌త ర‌త్న అవార్డును ప్ర‌క‌టించంది. పీవీ న‌ర్సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోడీ సంతోషం వ్య‌క్తం చేశారు. పీవీ ఓ మేధావి అని, రాజ‌నీత‌జ్ఞుడు అని త‌న ఎక్స్ అకౌంట్‌లో మోడీ కీర్తించారు. విభిన్న హోదాల్లో న‌ర్సింహారావు ప‌నిచేసిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రీ చ‌ర‌ణ్ సింగ్‌కు కూడా భార‌త‌ర‌త్న ఇచ్చి త‌మ ప్ర‌భుత్వం గౌర‌వించింద‌న్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయ‌న త‌న జీవితాన్ని అంకితం చేశార‌న్నారు. శాస్త్ర‌వేత్త స్వామినాథ‌న్‌కు కూడా భార‌త ర‌త్న ఇవ్వ‌డం ప‌ట్ల ప్ర‌ధాని మోడీ సంతోషం వ్య‌క్తం చేశారు.