Tuesday, October 22, 2024
Homeప్రత్యేక కథనాలుమన‌దేశంలో అత్యంత నెమ్మ‌దిగా న‌డిచే రైలు

మన‌దేశంలో అత్యంత నెమ్మ‌దిగా న‌డిచే రైలు

Date:

భార‌త రైల్వే వ్య‌వ‌స్థ‌కు ఎంతో చ‌రిత్ర ఉంది. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు రైల్వే వ్య‌వ‌స్థ నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉంది. ప్యాసింజ‌ర్ రైళ్ల నుంచి అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్‌ వరకూ అనేక రకాల రైళ్లు మ‌న‌దేశంలో ఉన్నాయి. అయితే మనదేశంలో నెమ్మదిగా నడిచే రైలు కూడా ఒకటి ఉంది. ఆ రైలు దాదాపు 111 స్టేషన్‌లలో ఆగుతూ 37 గంటలకు గానీ రైలు గమ్యస్థానానికి చేరుకోదు. అంత ఆల‌స్యంగా, నిధానంగా న‌డిచిన కాని ఈ రైలు టికెట్లకు మాత్రం భారీ డిమాండ్‌ ఉంటుంది.

దేశంలో అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు హౌరా-అమృత్‌సర్ మెయిల్. ఇది (పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌) ఐదు రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రారంభమైన తర్వాత దాని మార్గంలో ఉండే 111 స్టేషన్లలో ఆగుతుంది. పెద్ద స్టేషన్‌లలో కాస్త ఎక్కువ సేపు ఆగే ఈ రైలు చిన్న స్టేషన్‌లలో మాత్రం ఒకట్రెండు నిమిషాలకు మించి ఆగదు. హౌరా నుంచి అమృత్‌సర్ వరకు 1,910 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఈ రైలుకు 37గంటల సమయం పడుతుంది.

రైలులో టికెట్‌ ధరల విషయానికొస్తే, స్లీపర్ క్లాస్ రూ.695, థర్డ్ ఏసీ రూ. 1,870, రూ. సెకండ్ ఏసీ రూ.2,755, ఫస్ట్ ఏసీకి రూ.4,835గా టికెట్‌ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ ప్రాంతాలను కవర్‌చేస్తూ ఈ రైలు నడుస్తుండటంతో ప్రయాణికులు కూడా దీనికే మొగ్గు చూపుతున్నారు. ఇది హౌరా స్టేషన్ నుంచి రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది. మళ్లీ అమృత్‌సర్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 7.30 గంటలకు హౌరా స్టేషన్‌కు చేరుకుంటుంది.