Thursday, September 19, 2024
Homeజాతీయంజ‌మ్మూక‌శ్మీర్ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే ఎన్నికలు

జ‌మ్మూక‌శ్మీర్ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే ఎన్నికలు

Date:

వారసత్వ రాజకీయాలు తరహా పార్టీలు జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రాంతంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్ర‌ధాని మోడీ విమర్శించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌టించారు. అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆరోజులు ముగిశాయని చెప్పారు. అలాగే బిజెపి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికలు జమ్మూకశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన జమ్మూకశ్మీర్‌ను విదేశీ శక్తులు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరివారవాదులు వంచన చేయడం ప్రారంభించారు. మీరు విశ్వసించిన రాజకీయపార్టీలు మీ పిల్లల భవిష్యత్తును పట్టించుకోలేదు. వారు వారి వారసుల భవిష్యత్తుపైనే దృష్టిసారించారు. జమ్మూకశ్మీర్ యువత ఉగ్రవాదంతో బాధపడింది. ఈ వారసత్వ పార్టీలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, వేడుక చూశాయి.

2000 సంవత్సరం నుంచి ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగలేదన్న సంగతి మీకు తెలిసిందే. కొత్త నేతలకు అవకాశం ఇవ్వలేదు. అందుకే కొత్తనాయకత్వాన్ని మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నించాను. తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి చేర్చడమే ఈ ఎన్నికల అసలు లక్ష్యం. ఈ ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూలు ఉండేవని మీకు తెలుసు. లాల్‌చౌక్‌ వద్దకు వెళ్లాలంటే భయపడేవారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. ఆ రోజులు ముగిశాయి” అని మోదీ మాట్లాడారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వెల్లడించారు. పలు హామీలను ప్రకటించారు.