భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్ ఫోగట్ తాజాగా కీలక ప్రకటన చేశారు. రైల్వేస్లో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెజ్లర్లు ఇవాళ హస్తం పార్టీలో చేరుతున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు సదరు కథనాలు వెల్లడించింది. ఈ వార్తల వేళ వినేశ్ పోస్ట్ హాట్ టాపిక్గా మారింది.