Saturday, September 21, 2024
HomeUncategorizedపరీక్షల్లో అక్రమాల నిరోధ బిల్లు ఆమోదం

పరీక్షల్లో అక్రమాల నిరోధ బిల్లు ఆమోదం

Date:

పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా రూపొందించిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024’కు మంగళవారం లోక్‌సభలో ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ దీన్ని సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లుగా దీనిని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షలను అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు.

ఈ బిల్లుకు సంబంధించి విపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం లోక్‌సభ దీన్ని ఆమోదించింది. ఇది అమల్లోకి వస్తే పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా పడనుంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎన్‌డీఏ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్‌, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశపరీక్షలకూ వర్తిస్తుంది.