Sunday, September 22, 2024
HomeUncategorizedబ్యాంకు ఖాతాల‌కు న‌లుగురు నామినీలు

బ్యాంకు ఖాతాల‌కు న‌లుగురు నామినీలు

Date:

బ్యాంకు ఖాతాల నామినీల సంఖ్యను నలుగురి వరకు పెంచేలా మార్పులు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వం బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఒక నామినీని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు డైరెక్టర్‌షిప్‌ హోదా కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని సైతం పెంచేలా సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచనున్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిమితి దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్దేశించినది. ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టారు.

సహకార బ్యాంకులకు సంబంధించి కూడా బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదించినట్లు సమాచారం. చట్టబద్ధ ఆడిటర్లకు చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్ణయించుకునే స్వాతంత్ర్యాన్ని పూర్తిగా బ్యాంకులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంకుల రిపోర్టింగ్‌ తేదీలను రెండు, నాలుగో శుక్రవారాల నుంచి ప్రతినెలా 15, చివరి తేదీలకు మారుస్తూ సవరణ చేసినట్లు సమాచారం. ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ గత శుక్రవారమే ఆమోదం తెలిపింది.