Sunday, September 22, 2024
HomeUncategorizedవినేశ్‌.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌!

వినేశ్‌.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌!

Date:

భారత ప్రధాని మోడీ స్పందిస్తూ వినేశ్‌ను ఓదార్చారు. ”వినేశ్‌.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం” అని మోదీ భరోసానిచ్చారు.

పీటీ ఉషకు మోడీ ఫోన్‌..

తాజా పరిణామాల వేళ భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. వినేశ్‌పై అనర్హతకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీసిన ప్రధాని.. దీన్ని సవాల్‌ చేసేందుకు భారత్‌కు ఉన్న అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వినేశ్‌కు ఉపయోగపడుతుందనుకుంటే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వద్ద భారత్‌ నిరసనను బలంగా వ్యక్తపర్చాలని పీటీ ఉషకు సూచించినట్లు సమాచారం.

ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్‌ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ఈ మ్యాచ్‌ జరగాల్సిఉండగా.. ఈ ఉదయం పోటీదారుల బరువును పరీక్షించారు. ఇందులో ఆమె కొన్ని గ్రాముల అదనపు బరువు ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో పతకం చేజారింది.