కేరళలోని వాయనాడ్ లో సంభవించిన ప్రకృతి ప్రకోపానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గత పది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు 402మంది మృతి చెందినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇక గాలింపు చర్యల్లో భాగంగా రేపు ఉదయం 8 గంటలకు ఎస్కేఎంజే స్కూల్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక బృందంతో కూడిన హెలికాప్టర్ చలియార్ నదిపై స్కానింగ్ మిషన్తో బయలుదేరుతుంది.
ఆరు జోన్లలో సోదాలు కొనసాగుతాయని మంత్రి కె.రాజన్ తెలిపారు. రేపు సూచిపర సన్రైజ్ వ్యాలీ నుంచి అటవీ ప్రాంతాలపై దృష్టి సారిస్తారు. అటవీ ప్రాంతాలపై దృష్టి సారించి ఉదయం 8 గంటలకు తనిఖీలు ప్రారంభిస్తారు. సైన్యం మరియు అటవీ శాఖ అధికారులు శోధనకు నాయకత్వం వహిస్తారు మరియు మృతదేహాలను ఎయిర్ లిఫ్ట్ ద్వారా ఇక్కడి నుండి తరలిస్తారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రకృతి విలయం ఏర్పడితే ఇంతటి ప్రాణనష్టం ఉంటుందనడానికి వాయినాడ్ ఘటన ఉదాహరణగా నిలిచింది. టీ, కాఫీ తోటల్లో పని చేసుకునే కూలీలు, కార్మికులు వరద నీటిలో కొట్టుకుపోతే..కొందరు బండరాళ్లు కింద..బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.