Tuesday, October 8, 2024
HomeUncategorizedజేబులో చేతులు పెట్టుకొని పార్ల‌మెంట్‌కు వ‌స్తావా..

జేబులో చేతులు పెట్టుకొని పార్ల‌మెంట్‌కు వ‌స్తావా..

Date:

పార్ల‌మెంట్ లోక్‌సభలో వర్షాకాల సమావేశాలు జ‌రుగుతున్నాయి. బడ్జెట్ 2024పై చర్చ నడుస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ శుక్ర‌వారం లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి.. భారీ వాణిజ్య లోటుపై చర్చించాలని కోరారు. ఇదిలావుండగా… శుక్ర‌వారం లోక్‌సభలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి పార్లమెంట్‌ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఓ మంత్రి జేబులో పెట్టుకుని పార్లమెంటుకు వచ్చారు. ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. ఓం బిర్లా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. “మంత్రి, మీ చేతులు మీ జేబులో పెట్టుకోవద్దు. ముందుగా, గౌరవనీయులైన సభ్యులారా.. మీ జేబులో చేతులు పెట్టుకుని సభకు రావద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్‌ కూడా చేశారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు మధ్య లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఇరువురు నేతలూ వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్‌లో ఇంగ్లండ్‌లా పన్నులు తీసుకుంటారని, అయితే సోమాలియా తరహాలో సేవలు అందిస్తున్నారని చద్దా అన్నారు. ఈరోజు కూడా పార్లమెంటులో గందరగోళం జరిగే అవకాశాలు ఉన్నాయి.