పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కొత్తగా అసెంబ్లీకి హాజరైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకార సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని మంగళవారం గవర్నర్ ఆరోపించారు. అందుకుగాను వారు అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా, సభలో ఓటింగ్లో పాల్గొనాలన్నా రోజుకు రూ.500 జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించారు.
ఈ విషయంపై బుధవారం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. “నీట్ కుంభకోణంలో నేరస్థులకు జరిమానా విధించని గవర్నర్ అసెంబ్లీకి ఎన్నికైనవారికి మాత్రం జరిమానా విధిస్తారా? మీ దగ్గర డబ్బులు లేవా? టిఫిన్ చేయడానికి డబ్బులు కావాలంటే నన్ను అడగండి. నేను ఏర్పాటు చేస్తాను” అని మమత గవర్నర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.