నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఝార్ఖండ్లోని హజారీబాగ్, బిహార్లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధరణకు రావడం ప్రస్తుత దశలో కష్టం. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారు. వారిలో అనేకమంది వందల కి.మీల దూరం ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు” అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.