ఒక దివ్యాంగుడు సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని అందులో అర్హత సాధించాడు. నాలుగుసార్లు సివిల్స్లో ర్యాంకు పొందాడు కానీ అతడికి ఉద్యోగం మాత్రం రాలేదు. క్ డిజెబిలిటీ సర్టిఫికెట్తో సివిల్స్ ఉద్యో గం పొందిన పూజా ఖేద్కర్ వివాదం వేళ.. అర్హుడైన కార్తీక్ కన్సాల్కు అన్యాయం జరిగిందంటూ ఆయన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్తీక్ స్టోరీని రిటైర్డ్ ఐఏఎస్ సంజీవ్ గుప్తా ట్విట్టర్లో పోస్టు చేశారు.
సివిల్స్ లక్ష్యాన్ని చిదిమేస్తున్నారు
కార్తీక్ కన్సాల్ ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత సివిల్స్కు ప్రిపేర్ అయ్యాడు. 2019లో 813వ ర్యాంక్ సాధించాడు. అప్పుడు మొత్తం 15 లోకోమోటర్ డిజెబిలిటీ ఖాళీలు ఉండగా 14 పోస్టులను భర్తీ చేశారు. కార్తీక్కు ఉద్యోగం రావాల్సి ఉండగా రాలేదు. 2021లో కార్తీక్ 271వ ర్యాంక్ సాధించాడు. ఆ నోటిఫికేషన్లో ఏడు లోకోమోటర్ డిజెబిలిటీ పోస్టులు ఉండగా, నాలుగింటిని భర్తీ చేశారు. ఆ కేటగిరీలో కార్తీక్ ఫస్ట్ ప్లేసులో ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదు. ఇక 2022లో 784, 2023లో 829వ ర్యాంకులు సాధించినా యూపీఎస్సీ ఉద్యోగం ఇవ్వలేదు. దీనిపై కార్తీక్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కాగా, ప్రస్తుతం కార్తీక్ ఇస్రోలో సైంటిస్ట్గా పని చేస్తున్నాడు.
60శాతమే డిజెబిలిటీ కానీ
కార్తీక్ మస్కులర్ డిస్ట్రోఫితో బాధపడుతున్నాడని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్ధారించింది. డిజెబిలిటీ 60 శాతమేనని సర్టిఫికెట్లో ఉంది కానీ అది 90 శాతమని పేర్కొంది. కార్తీక్ చూడడం, వినడం, రాయడం, మాట్లాడడం అన్నీ చేయగలడు.. కానీ నిలబడలేడని తెలిపింది. యూపీఎస్సీ రూల్స్ ప్రకారం.. ఐఏఎస్కు మస్కులర్ డిస్ట్రోఫి ఉన్నోళ్లు అనర్హులు. ‘నిపుణుల సూచన మేరకు ఫంక్షనల్, ఫిజికల్ అర్హతలను బట్టి దివ్యాంగులకు సర్వీసులను కేటాయిస్తాం. కార్తీక్ ర్యాంక్, అర్హతలను బట్టి.. ఆయన ఏ సర్వీస్కు సరిపోలేదు’ అని యూపీఎస్సీ పేర్కొంది.