Monday, October 7, 2024
HomeUncategorizedప్రాంతీయ పార్టీల ఆదాయాల్లో బిఆర్ఎస్‌దే అగ్రస్థానం

ప్రాంతీయ పార్టీల ఆదాయాల్లో బిఆర్ఎస్‌దే అగ్రస్థానం

Date:

దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయ‌, ఖ‌ర్చుల‌పై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ తాజా నివేదిక విడుద‌ల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బిఆర్ఎస్ పార్టీకి రూ.737.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లో బీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిని విశ్లేషించిన ఏడీఆర్‌.. 57 ప్రాంతీయ పార్టీలకు గాను 39 పార్టీల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసింది.

ఆదాయంలో బిఆర్ఎస్‌ తర్వాత రెండోస్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలిచింది. టీఎంసీకి రూ.333.45 కోట్లు రాగా, డీఎంకేకు రూ.124.35 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్‌ వెల్లడించింది. మొత్తంగా 39 ప్రాంతీయ పార్టీలకు రూ.1740.48 కోట్లు సమకూరగా.. వాటిలో ఐదు పార్టీలకే రూ.1541.32కోట్లు వచ్చినట్లు తెలిపింది. మొత్తం ఆదాయంలో 88.56శాతం వీటికే రావడం గమనార్హం. ఆదాయంలో బిఆర్ఎస్‌ తర్వాత రెండోస్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నిలిచింది. టీఎంసీకి రూ.333.45 కోట్లు రాగా, డీఎంకేకు రూ.124.35 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్‌ వెల్లడించింది. మొత్తంగా 39 ప్రాంతీయ పార్టీలకు రూ.1740.48 కోట్లు సమకూరగా.. వాటిలో ఐదు పార్టీలకే రూ.1541.32కోట్లు వచ్చినట్లు తెలిపింది. మొత్తం ఆదాయంలో 88.56శాతం వీటికే రావడం గమనార్హం.

ఇక వ్యయాల విషయానికొస్తే.. ఆల్‌ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉందని ఏడీఆర్‌ వెల్లడించింది. టీఎంసీ రూ.181.18 కోట్లు ఖర్చుపెట్టగా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైకాపా) రూ.79.32 కోట్లు, భారాస రూ.57.47 కోట్లు, డీఎంకే రూ.52.62 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ రూ.31.41కోట్ల వ్యయం చేసినట్లు ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. వచ్చిన ఆదాయంలో భారాస రూ.680 కోట్లు ఖర్చు చేయలేదు. బిజు జనతాదళ్‌ రూ.171.06 ఖర్చు చేయకపోగా, డీఎంకే రూ.161 కోట్లను ఖర్చుపెట్టలేదని ఏడీఆర్‌ పేర్కొంది. వీటికి విరుద్ధంగా 20 ప్రాంతీయ పార్టీలు మాత్రం తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చుపెట్టినట్లు తాజా నివేదిక తెలిపింది. జేడీఎస్‌కు వచ్చిన ఆదాయం కంటే 490శాతం అదనంగా ఖర్చు పెట్టినట్లు అంచనా.