Monday, October 7, 2024
HomeUncategorizedఆప్ పార్టీపై తీహార్ జైలు అధికారులు ఆగ్ర‌హాం

ఆప్ పార్టీపై తీహార్ జైలు అధికారులు ఆగ్ర‌హాం

Date:

ఆప్ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై చేస్తున్న ఆరోపణలను తిహాడ్‌ జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు. జైలు పరిపాలనా విలువలను దెబ్బ తీయడానికే ఆప్‌ నేతలు ఇటువంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్‌ 8.5 కిలోల బరువు తగ్గారని.. ఆయన చక్కెర స్థాయిలు ఐదుసార్లు 50 కంటే తక్కువకు పడిపోయాయని ఇటీవల ఆప్‌ నేతలు పేర్కొన్నారు. జైల్లోనే ఆయనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తిహార్ జైలు అధికార‌ యంత్రాంగం సోమవారం స్పందించింది. కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 1న కేజ్రీవాల్‌ను తిహార్‌ జైలుకు తీసుకువచ్చినప్పుడు ఆయన బరువు 65 కిలోలు అని, ఎన్నికల నేపథ్యంలో సుప్రీం బెయిల్‌ మంజూరుచేసే సమయానికి 65 కిలోలకు పెరిగారని పేర్కొన్నారు. అనంతరం అతడు జైల్లో లొంగిపోయిన సమయంలో ఆయన బరువు 63.5 కిలోలుగా నమోదైందన్నారు. ప్రస్తుతం ఆయన 61.5 కిలోల బరువు ఉన్నారని జైలు అధికారులు వెల్లడించారు.