Monday, October 7, 2024
Homeక్రైంప్రియుడిని నడుముకు కట్టుకుని బావిలో దూకిన కొత్త పెళ్లికూతురు

ప్రియుడిని నడుముకు కట్టుకుని బావిలో దూకిన కొత్త పెళ్లికూతురు

Date:

త‌న మాజీ ప్రియుడిని న‌డుముకు కట్టుకొని వ్యవసాయ బావిలో పడి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని చింతామణి తాలూకాలోని ఎం.ముద్దాలహళ్లిలో చోటుచేసుకుంది. చింతామణి తాలుకాలోని కాచనహళ్లికి చెందిన వివాహిత మహిళ అనూషా(19), ఎం.ముద్దలహళ్లి గ్రామానికి చెందిన వేణు(21) ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

గత రెండేళ్లుగా వేణు, అనుషా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కులాలు వేరు. అనుషా బంధువులు కూడా వీరి పెళ్లిని వ్యతిరేకించారు. అనూషాకు ఆమె తల్లిదండ్రులు ఇదే ఏడాది మే 26వ తేదీన చింతామణి తాలూకాలోని కాచహళ్లికి చెందిన చౌడ్ రెడ్డి అనే యువకుడితో వివాహం జరిపించారు. చౌడ్ రెడ్డి, అనుషాలు పెళ్లి చేసుకున్న తరువాత బెంగళూరు నగర శివార్లలోని డాబస్‌పేటలో కాపురం పెట్టి అక్కడే నివాసం ఉంటున్నారు. ఆషాడ మాసం సందర్బంగా అనూషా ఆమె స్వగ్రామానికి వచ్చింది.పెళ్లి తర్వాత కూడా ప్రేమికులు అనుషా, వేణు మొబైల్ ఫోన్ల ద్వారా టచ్‌లో ఉన్నారు. సొంత గ్రామానికి వెళ్లిన అనుషా ఆమె మాజీ ప్రియుడు వేణును కలిసి మాట్లాడిందని తెలిసింది. ఇక కలిసి జీవించలేమని అనుకున్న ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి గ్రామం సమీంలోని వ్యవసాయ పొలంలోని బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం రాత్రి చింతామణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కెంచర్లహళ్లి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.