Sunday, October 6, 2024
HomeUncategorizedఎస్ఐలుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

ఎస్ఐలుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

Date:

అవ‌కాశాలు అంద‌రికి ఉంటేనే దేశం అభివృద్దిలోకి దూసుకుపోతుంది. అలాంటిది దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి ఎస్ఐలుగా ఎంపిక‌య్యారు. బిహార్‌ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ట్రాన్స్‌మెన్ పుట్టుకలో ఆడ కాగా, ఒకరు ట్రాన్స్‌ఉమెన్ పుట్టుకలో మగగా ఉన్నారు. గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్‌లు ఎస్ఐలుగా ఎంపిక‌య్యారు. ట్రాన్స్ జెండ‌ర్లు పోలీసు శాఖ‌లో ఎంపిక కావ‌డం ప‌ట్ల ఆ క‌మ్యూనిటీకి చెందిన వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.