Sunday, October 6, 2024
HomeUncategorizedరైలు కింద ప‌డి తండ్రీకొడుకులు ఆత్మ‌హ‌త్య‌

రైలు కింద ప‌డి తండ్రీకొడుకులు ఆత్మ‌హ‌త్య‌

Date:

తండ్రీకొడుకులు ఇద్దరూ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో జ‌రిగింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముంబైకి 32 కిలోమీటర్ల దూరంలోగల భయందర్‌ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారు. వాళ్లిద్దరు తండ్రీకొడుకులు. తండ్రి హరీష్‌ మెహతా (60), కొడుకు జై మెహతా (35). ఈ ఇద్దరూ ప్లాట్‌ఫామ్‌ చివరి వరకు వెళ్లేసరికి.. ఎదురుగా ఒక లోకల్‌ రైలు వస్తోంది. ప్లాట్‌ఫామ్‌ దిగిన తండ్రీకొడుకులు ఒక్కసారిగా చేయిచేయి పట్టుకుని ట్రాక్‌పై వచ్చారు. రైలు తమను సమీపించేసరికి ఇద్దరూ ఒకరిచేయి ఒకరు పట్టుకుని ట్రాక్‌పై బోర్లా పడుకున్నారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఆ ఇద్దరిపై నుంచి రైలు దూసుకుపోయింది. దాంతో అక్కడికక్కడే తండ్రీ కొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.