Saturday, October 5, 2024
HomeUncategorizedరాజ్యసభలో కళ్లుతిరిగి పడిపోయిన ఎంపీ

రాజ్యసభలో కళ్లుతిరిగి పడిపోయిన ఎంపీ

Date:

రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్‌ నాయకురాలు ఫూలోదేవి నేతమ్‌ సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్‌ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్‌ వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఫూలోదేవి కళ్లు తిరిగి కిందపడిపోగానే సాటి సభ్యులు, రాజ్యసభ సిబ్బంది హుటాహుటిన ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెతోపాటు మరికొందరు మహిళా ఎంపీలు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.