Friday, October 4, 2024
HomeUncategorizedహజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి

హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి

Date:

హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విపరీతమైన వేడి కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకారం ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1000ని దాటింది. ఎక్కువగా ఈజిప్టు దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ దేశానికి చెందిన వారు 600కి పైగా ఉన్నారు. ఇదిలా ఉంటే హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అన్ని మరణాలు కూడా ”సహజ కారణాల” వల్లనే చోటు చేసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీకి వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడికి వెళ్లిన భారతీయుల కోసం చేయగలిగిందంతా చేస్తున్నామని చెప్పింది. ఇస్లాం 5 నియమాల్లో ఒకటైన హజ్ యాత్ర కోసం యాత్రికులు సౌదీకి వెళ్తుంటారు. ఇస్లాం ప్రకారం, ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. ఈ ఏడాది సౌదీలో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఈ వారం అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 51.8 డిగ్రీలకు చేరుకుంది. తీర్థయాత్ర కోసం గంటల తరబడి ఎండలో నడవడం, ప్రార్థనలు చేయడంతో చాలా మంది అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది.