Friday, October 4, 2024
HomeUncategorizedకవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

Date:

సీబీఐ ప్రత్యేక కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ పై సీబీఐ దాఖలు చేసిన కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జులై 7వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కవిత బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం మధ్యంతర బెయిల్ కూడా దక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ న్యాయ విభాగం కూడా శ్రమిస్తోంది. ఇటీవల కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. ఆమెకు బెయిల్ లభించలేదు. తనను అక్రమంగా అరెస్టు చేశారని.. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసని అప్పట్లో కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు ఆమె కస్టడీని కూడా కోర్టు పొడిగిస్తూ వస్తోంది.

ఈ కేసులో కవితే ప్రధాన నిందితురాలని, ఆమెకు బెయిల్ వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదిస్తూ వస్తోంది. ఈమేరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో 100 కోట్ల ముడుపులు చేతులు మారాయని.. అందులో కీలక సూత్రధారి, పాత్రధారి కవితేనంటూ ఈడీ, సీబీఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చార్జిషీట్లలోనూ ఇదే విషయం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన వారు సుదీర్ఘ కాలంగా జైల్లో ఉంటున్నారు.