ఓ అమ్మాయి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి.. ప్రాణాలను కోల్పోయింది. మహారాష్ట్ర దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఔరంగాబాద్ వద్ద ఉన్న సులీబంజన్ హిల్స్పై కారును రివర్స్ తీయడం నేర్చుకుంటున్న ఆమె.. నేరుగా వెళ్లి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వేజ్ మృతిచెందింది. అయితే తన ఫ్రెండ్ 25 ఏళ్ల సూర్ సంజూ మూలేతో కలిసి ఆమె ఆ హిల్స్కు వెళ్లింది. అక్కడ కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో ఆమె ఫ్రెండ్ వీడియో తీశాడు. నెమ్మదిగా రివర్స్ తీయాలంటూ ఆ అబ్బాయి చెబుతున్న సమయంలో శ్వేత కారును రివర్స్ చేసింది. లోయకు 50 మీటర్ల దూరంలోనే ఆమె కారును రివర్స్ తీసింది. కానీ వెనక్కి వెళ్తున్న కొద్దీ ఆమె కారు వేగాన్ని పెంచింది. స్లో చేయాలని ఫ్రెండ్ చెబుతున్నా ఆమె కారు వేగాన్ని నియంత్రించలేకపోయింది. క్లచ్ క్లచ్ అంటూ ఆమె ఫ్రెండ్ అరిచాడు. కారును ఆపేందుకు ఫ్రెండ్ పరుగెత్తినా.. వేగంగా రివర్స్ తీయడంతో ఆ కారు వెళ్లి లోయలో పడింది. ఈ ఘటన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగింది. సుమారు 300 ఫీట్ల లోతులోకి కారు పడిపోయింది. కారు తుక్కుతుక్కు అయిన విజువల్స్ రిలీజ్ చేశారు. సులీబంజన్ కొండల్లో ఉన్న దత్తాత్రేయ ఆలయాన్ని వాళ్లు విజిట్ చేశారు. కానీ వాళ్ల ప్రయాణం విషాదంతం అయ్యింది.