సుమారు 99 లక్షల ఖరీదైన గోల్డ్ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్లూటూత్ స్పీకర్లో బంగారాన్ని దాచి తీసుకెళ్తున్న నౌషాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రియాద్ నుంచి బహ్రాయిన్ ద్వారా అతను కొచ్చికి వచ్చాడు. ఎగ్జిట్ గేట్ వద్ద అతన్ని అడ్డుకున్నారు. బ్యాగేజీని స్కానింగ్ చేస్తున్న సమయంలో బ్లూటూత్ స్పీకర్పై అనుమానం వచ్చింది. చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గోల్డ్ ఉన్నట్లు నిర్ధారించారు. స్పీకర్ లోపల సుమారు 1.35 కేజీల బరువు ఉండే బంగారాన్ని దాచిపెట్టారు. ఈ కేసులో మరింత విచారణ చేపడుతున్నారు.