ఒక కోడలు తన అత్తను 95 సార్లు కొడవలితో పొడిచి చంపింది. ఈ కేసులో కోడలికి మధ్యప్రదేశ్ కోర్టు మరణశిక్షను విధించింది. 2022లో రేవా జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లా నాలుగవ అదనపు సెషన్స్జడ్జి పద్మా జాతవ్ ఈ కేసులో తీర్పును ఇచ్చారు. 50 ఏళ్ల సరోజ్ కోల్ను.. 24 ఏళ్ల కంచన్ కోల్ హత్య చేసినట్లు కోర్టు ద్రువీకరించింది. మన్గావా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అత్రైలా గ్రామం వాసి అయిన కంచన్.. తన అత్తను కొడవలితో 95 సార్లు పొడిచింది. ఇంట్లో గొడవ జరగడంతో 2022, జూలై 112న ఆమె ఆ దాడికి పాల్పడింది. దాడి జరిగిన సమయంలో బాధితురాలు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సరోజ్ కోల్ భర్త వాల్మిక్ కోల్ను కూడా ఈ కేసులో చేర్చారు. అతను రెచ్చగొట్టడం వల్లే కోడల హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కానీ ఆధారాలు లేకపోవడంతో అతన్ని వదిలేశారు.