మైనర్ బాలికతో శారీరక సంబంధం బాధితురాలి సమ్మతితోనే జరిగినప్పటికీ అది అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ కోర్టు స్పష్టం చేసింది. 14 ఏళ్ల బాలిక గర్భం ధరించడానికి కారణమైన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ జడ్జి అమిత్ సహ్రావత్ ఈ విషయం తెలిపారు. 2015 జనవరిలో నమోదైన ఈ కేసు విచారణ ముగింపు దశకు వచ్చింది. బాలికకు జన్మించిన బిడ్డకు తండ్రి నిందితుడేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలింది.