Tuesday, October 1, 2024
HomeUncategorizedస్ట్రెచ్చర్‌పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ

స్ట్రెచ్చర్‌పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ

Date:

గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ లేవలేని స్థితిలో ఉన్న ఒక మహిళ కుటుంబసభ్యుల సహాయంతో స్ట్రెచ్చర్‌పై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు… బిహార్‌లోని దర్భాంగ స్థానిక పాఠశాలలో పోలింగ్‌బూత్‌ను ఏర్పాటుచేశారు. చౌగ్మా ప్రాంతానికి చెందిన సుభద్రాదేవి తన ఓటును వినియోగించుకోవాలనుకున్నారు. ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె నడవలేని స్థితిలో ఉన్నారు. అయినా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే ఆశయంతో కుటుంబసభ్యుల సహాయంతో స్ట్రెచ్చర్‌పై వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఆమె కుమారుడు విజయ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ”మా అమ్మ చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఎక్కువ కాలం బతకనని తెలిసినా తన జీవితంలోని చివరి రోజుల్లోనూ తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. ఈ రోజు మా అమ్మ ఓటు వేసింది. ఆమె గత కొద్ది రోజులుగా నీరు మాత్రమే తీసుకుంటోంది. తన చివరి కోరికగా ఓటు వేయడానికి తీసుకెళ్లమని మమ్మల్ని అడిగింది. అధికారుల సహాయంతో ఆమె ఆశయం నెరవేర్చాం” అని తెలిపారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థించారు.