Monday, September 30, 2024
HomeUncategorizedఎండ వేడిమికి తట్టుకోలేక నలుగురు ఓటర్లు మృతి

ఎండ వేడిమికి తట్టుకోలేక నలుగురు ఓటర్లు మృతి

Date:

కేర‌ళ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో శుక్రవారం అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఓట‌ర్లు ఆప‌సోపాలు ప‌డుతూ పోలింగ్ బూత్‌ల‌కు చేరుకుంటున్నారు. కేర‌ళ‌లో హీట్‌వేవ్ ఎక్కువ‌గా ఉన్న‌ది. పాలక్కాడ్‌, మ‌ల‌ప్పురం, అల‌ప్పుజా నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురు ఓట‌ర్లు మృతిచెందారు. ఎండ వేడి త‌ట్టుకోలేక వాళ్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు.

ఒట్ట‌పాలెంలో ఓ వ్య‌క్తి ఓటు వేసిన త‌ర్వాత ప్రాణాలు కోల్పోయాడు. అత‌ని వ‌య‌సు 68 ఏళ్లు. ఒట్ట‌పాలెం తాలూక ఆస్ప‌త్రికి తీసుకెళ్లినా అత‌ని ప్రాణాలు ద‌క్క‌లేదు. పాల‌క్కాడ్‌లో అత్య‌ధికంగా 40 డిగ్రీలు న‌మోదు అయ్యింది. తిరూర్‌లో ఓటు వేసిన ఓ మ‌ద‌రసా టీచ‌ర్ కూడా ఇంటికి వ‌చ్చి కుప్ప‌కూలిపోయాడు. అల‌ప్పుజాలో ఓటు వేసి ఇంటికి వెళ్లిన త‌ర్వాత 82 ఏళ్ల సోమ‌రాజ‌న్ ప్రాణాలు కోల్పోయాడు. కేర‌ళ‌లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఓటింగ్ 40 శాతం దాటింది.