వైజాగ్ ఉత్తర నుంచి తాను జై భారత్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని, తన ప్రచారానికి వస్తున్న విశేష ప్రజాదరణను ఓర్వలేక కొంతమంది కావాలనే తనపై కక్ష కట్టారని, తనకు ప్రాణహాని వుందని వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ కు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి(జేడి) లక్ష్మీనారాయణ శుక్రవారం ఫిర్యాదు చేసారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖపట్నం పోలీసు కమిషనర్కు కలిసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.