Monday, September 30, 2024
Homeక్రైంరోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి

Date:

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ద్విచక్ర వాహనం డీ కొట్టిన ఘటనలో నలుగురు యువకులు మృతిచెందారు. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నిర్లక్షం అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వరంగల్ జిల్లాలో జరిగింది.

నలుగురు యువకుల ప్రాణాలను బస్సు రూపంలో మృత్యువు కబలించింది. నిర్లక్ష్యపు ప్రయాణానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో జరిగింది. వర్ధన్నపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు- వర్ధన్నపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా. మరో యువకుడు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతులు అంతా ఇల్లంద గ్రామానికి వరుణ్ తేజ, సిద్దు,గణేష్, అనిల్ కుమార్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై నలుగురు యువకులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు మిత్రులు ఒకే ఘటనలో మృతి చెందడంతో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఊరంతా విషాదఛాయలు అలముకున్నాయి.. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.