Monday, September 30, 2024
HomeUncategorizedబద్రీనాథ్, కేదార్‌నాథ్‌కు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్

బద్రీనాథ్, కేదార్‌నాథ్‌కు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్

Date:

భారతదేశంలో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర చార్ ధామ్. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్.. ఈ నాలుగు క్షేత్రాలను కలిపే చార్‌ధామ్‌గా పిలుస్తారు. వేసవిలోనే ఈ యాత్ర మొదలవుతుంది. ఇందులో బద్రీనాథ్, కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ తీసుకుంటే హరిద్వార్, గుప్తకాశి, కేదార్ నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌ను సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇది 8 పగలు, 7 రాత్రులు ఉంటుంది. ఈ ప్యాకేజీలో మీరు ఆహారం, వసతి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్యాకేజీలోనే బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సదుపాయం లభిస్తుంది. ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన సమాచారం కొరకు మీరు 82879312886 సంప్రదించవచ్చు. 

ఈ ప్యాకేజీని దో ధామ్ యాత్ర ఎక్స్ నాగ్ పూర్ (డబ్ల్యుఎంఎ78)గా పిలుస్తున్నారు. ఇది జూన్ 5, 2024 నుంచి ప్రారంభమవుతుంది. ప్యాకేజీ కింద బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఇస్తారు. లంచ్ మాత్రం మీరే చేయాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ దో ధామ్ టూర్ ప్యాకేజీ రూ.46,900 నుంచి ప్రారంభమవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.46,900 అయితే.. డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.49,800గా ఉంది. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.73,700 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో చార్ ధామ్ క్షేత్రాలను తెరుస్తారు. ఈ యాత్రకు ఫుడ్ డిమాండ్ ఉంటుంది. సొంతంగా వెళ్లే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీతో వెళ్తే..అన్ని వాళ్లే చూసుకుంటారు.