Sunday, September 29, 2024
HomeUncategorizedపరిపాలనను అవినీతి ఎప్పటికీ శాసించదు

పరిపాలనను అవినీతి ఎప్పటికీ శాసించదు

Date:

పరిపాలనను అవినీతి ఎప్పటికీ శాసించలేదు. ఇకపై అవినీతి అనేది అవకాశం, ఉద్యోగం లేదా కాంట్రాక్టుకు ‘పాస్‌వర్డ్‌’ కాదు. అది జైలుకెళ్లే మార్గం. అధికారగణంలో అవినీతి శక్తులకు అడ్డుకట్ట పడుతోందని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. అవకాశాలు, ఉద్యోగాలకు ఇక అవినీతి అనేది ఓ పాస్‌వర్డ్‌లా ఉండదన్నారు. నాగ్‌పూర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌లో ఐఆర్‌ఎస్‌ 76వ బ్యాచ్‌ వీడ్కోలు సభలో ధన్‌ఖడ్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగించారు. నేడు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. నిద్రాణస్థితి నుంచి మేలుకున్న భారత్.. ప్రపంచశక్తిగా ఎదిగే దిశగా వేగంగా దూసుకుపోతోంది. జీ-20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించే సమయంలో భారత్‌.. దక్షిణ దేశాల గొంతుకగా మారింది. ప్రస్తుతం మన దేశం ప్రముఖ వేదికగా మారింది. భారత్‌ దూరదృష్టి, నాయకత్వాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నారు.

ఐఆర్‌ఎస్‌ అధికారులకు సాంకేతికత పరిజ్ఞానం అవసరాన్ని ధన్‌ఖడ్‌ నొక్కి చెప్పారు. నేటి సమాజంలో నగదు నిర్వహణ అనేది ముప్పుగా మారిందన్నారు. సాంకేతికత అనేది అనధికారిక నిర్వహణను నిరుత్సాహపరుస్తుందని.. ఇది సమాజాన్ని దెబ్బతీస్తుందన్నారు. కానీ, నేడు అవినీతిని సహించలేనివిధంగా భారత్‌ రూపుదిద్దుకుందన్నారు. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.