ఇంటి మీద బంగ్లాపై ఒక విదేశీయుడు గంజాయి సాగుచేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రిటన్కు చెందిన జేసన్ ఉత్తర గోవాలోని సొకారోలో నివాసం ఉంటున్నాడు. అతడు తన ఇంటిపై గంజాయి సాగుచేస్తున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సమాచారం అందించారు. అతని ఇంటిపై దాడిచేసిన అధికారులు.. ఇతర మొక్కలతోపాటు పూల కుండీల్లో గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. 33 గంజాయి చెట్లు, 10 గ్రాముల గంజా, రూ.40 వేలు సీజ్ చేశారు. దీంతో కేసు నమోదుచేసి జేసన్ను అదుపులోకి తీసుకున్నారు.
గతంలో కూడా ఎన్సీబీ అధికారులు అతడిని అరెస్టు చేశారు. 2022, నవంబర్ 28న అతనివద్ద 107 ఎక్స్టసీ ట్యాబ్లెట్లు, 40 గ్రాముల ఎండీఎంఏ పౌడర్, 55 గ్రాముల చరాస్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు బెయిల్పై ఉన్నాడు.