Saturday, September 28, 2024
Homeక్రైంమంత్రి పొంగులేటి కుమారుడికి ఈడీ సమన్లు

మంత్రి పొంగులేటి కుమారుడికి ఈడీ సమన్లు

Date:

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెన్నై కస్టమ్స్ విభాగ అధికారులు సమన్లు జారీ చేశారు. హర్షారెడ్డి డైరెక్టర్ గా ఉన్న హైదరాబాద్లోని కంపెనీకి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించి, విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది. ఈ సమన్లు జారీకి అత్యంత ఖరీదైన వస్తువులను తెప్పించడమే కారణంగా తెలుస్తోంది. హర్షారెడ్డి విదేశాల నుంచి అత్యంత ఖరీదైన వాచ్ లను తెప్పించినట్టు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం రాలేనని సమాచారం

మంత్రి కుమారుడికి సమన్లు జారీ చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణకు ఈ నెల నాలుగో తేదీన హాజరుకావాలని సూచించారు. అయితే, హర్షారెడ్డి తాను డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్టు అధికారులకు చెప్పడంతోపాటు రాలేనని స్పష్టం చేశారు. ఈ నెల 27 తరువాత హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. దీనికి చైన్నై కస్టమ్స్ అధికారులు సానుకూలతను వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రి ఇప్పటి వరకు మాట్లాడలేదు. 

కస్టమ్స్ అధికారులు వాచులు కొనుగోలు వ్యవహారంపైనా ఆరోపణలు చేస్తున్నారు. హర్షారెడ్డి హాంకాంగ్లో ఉంటున్న భారతీయుడు, లగ్జరీ వాచుల డీలర్ మహ్మద్ ఫహేరుద్దీన్ ముబీన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన అలోకం నవీన్ కుమార్ సింగపూర్ – చెన్నై విమానంలో గడియారాలను తీసుకువచ్చాడు. అతడిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. ఆ వాచీలు విలువ రూ.1.73 కోట్లుగా ఉంటుందని నిర్ధారించారు. వాటిని హర్షారెడ్డి కోసం తెచ్చినట్టు కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు చిక్కిన నవీన్ కుమార్ విచారణలో భాగంగా ఈ వాచును హర్షారెడ్డి కోసం తెచ్చినట్టు చెప్పినట్టు కస్టమ్స్ అదికారులు చెబుతున్నారు. తాను హర్షారెడ్డికి, ముబీన్కు మధ్యవర్తిగా మాత్రమే ఉన్నట్టు నవీన్ కుమార్ చెప్పడంతో.. కస్టమ్స్ అధికారులు మంత్రి కుమారుడికి నోటీసులు జారీ చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా హర్షారెడ్డి ఆ మొత్తాన్ని బదలాయించినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై హర్షారెడ్డి మాట్లాడుతూ కస్టమ్స్ అధికారుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టి పారేశారు.