Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంభూపాలపల్లి ఫొటో గ్రాఫర్ అరుదైన ఘనత

భూపాలపల్లి ఫొటో గ్రాఫర్ అరుదైన ఘనత

Date:

తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటో గ్రాఫర్, డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. ఆయన తీసిన ఫొటోను అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించారు. ఎన్ఎఫ్‌టీఎన్‌వైసీ అనే సంస్థ ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో 5 వేల ఫొటోలు పోటీ పడగా.. తాను తీసిన చిత్రం పోటీలో ఎంపికైందని అరుణ్ కుమార్ తెలిపారు.

అదే ఫొటోను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బర్డుపై మంగళవారం (మార్చి 26న) రాత్రి నుంచి ప్రదర్శితమవుతున్నట్లు అరుణ్ కుమార్ వెల్లడించారు. నాలుగు రోజులపాటు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని అరుణ్ కుమార్ అన్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ సహకారంతో లలిత కళా అకాడమీ నిర్వహించిన మేళా మూమెంట్ ఫొటోగ్రఫీ పోటీల్లోనూ ఆయన ఇటీవల బహుమతి అందుకున్నారు. గత డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ అరుణ్ కుమార్ తీసిన ఫొటోల గురించి మన్ కీ బాత్‌లోనూ ప్రస్తావించడం విశేషం.