Sunday, September 22, 2024
HomeUncategorizedగుజరాత్ నుంచి రాజ్యసభకు నడ్డా

గుజరాత్ నుంచి రాజ్యసభకు నడ్డా

Date:

రాజ్యసభ ఎన్నికల కోసం బిజెపి తాజాగా మరో ఏడుగురితో జాబితాను విడుదల చేసింది. గుజరాత్‌ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురిని ఎంపిక చేసింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గుజరాత్‌ నుంచి బరిలో నిలిపింది. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన పదవీ కాలం ఏప్రిల్‌తో ముగియనుండటంతో అతడిని ఈసారి గుజరాత్‌ నుంచి నామినేట్‌ చేయాలని నిర్ణయించింది. అలాగే, కాంగ్రెస్‌ను వీడి మంగళవారం బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చింది.

వీరిద్దరితో పాటు రాజ్యసభ బరిలో గుజరాత్‌ నుంచి గోవింద్‌ భాయ్‌ ఢోలాకియా, మయాంక్‌ భాయ్‌ నాయక్‌, డా.జశ్వంత్‌ సిన్హ్‌ సలాంసిన్హ్‌ పర్మార్‌ ఉండగా.. మహారాష్ట్ర నుంచి మేధా కులకర్ణి, డా.అజిత్‌ గోప్చాడేలను ఎంపిక చేసింది. 15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్‌లో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.