Friday, September 27, 2024
HomeUncategorized514 ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులు

514 ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులు

Date:

భారత పార్లమెంట్ లోని 514 మంది లోక్ సభ సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదయ్యాయని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల ఆధారంగా ఏడీఆర్ ప‌లు వివ‌రాల‌తో నివేదిక విడుద‌ల చేసింది.

ఈ నివేదిక ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన వారిలో 29 శాతం మందిపై హ‌త్య‌, హ‌త్యాయ‌త్నం, మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డం, అప‌హ‌ర‌ణ‌, మ‌హిళ‌ల‌పై నేరాల‌కు పాల్ప‌డ‌టం లాంటి తీవ్ర‌మైన కేసులు ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. మొత్తం 9 మందిపై హ‌త్య కేసులు న‌మోదు కాగా, వీరిలో ఐదుగురు బీజేపీకి చెందిన‌వారే. 28 మందిపై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదు కాగా, వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వారే కావ‌డం గ‌మ‌న్హారం. మ‌హిళ‌ల‌పై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు న‌మోద‌య్యాయి. లోక్‌స‌భ ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వ‌రులు ఉన్నారు. వీరి ఒక్కొక్క‌రి సంప‌ద రూ. 100 కోట్ల‌కు పైమాటే. అత్యంత ధ‌నిక ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన న‌కుల్ నాథ్ తొలిస్థానంలో ఉన్నారు. త‌ర్వాతి స్థానాల్లో డీకే సురేశ్‌(కాంగ్రెస్), ర‌ఘురామ‌కృష్ణ రాజు ఉన్నారు. 73 శాతం మంది ఎంపీలు గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.