Sunday, September 29, 2024
HomeUncategorizedయూపీ ప్రజలు ఇద్దరిని తిరస్కరించారు

యూపీ ప్రజలు ఇద్దరిని తిరస్కరించారు

Date:

ఉత్తరప్రదేశ్ ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని ప్రధాని మోడీ శుక్రవారం అన్నారు. అయినా వారు మరలా ప్రజల ముందుకువస్తున్నారని విమర్శించారు. యూపీలోని అమ్రోహాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మోదీ ప్రతిపక్షాలు మా విశ్వాసంపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా అవి ‘అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపుల’ బుట్టను మోస్తూ ఓట్లు అడగడానికి బయల్దేరాయని అసహనం వ్యక్తంచేశారు.

అయోధ్యలోని రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానిస్తే సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ తిరస్కరించాయని ఆయన విమర్శించారు. ”యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ‘భారత్ మాతా కీ జై’ అని చెప్పడం కూడా కష్టం.” అని మోడీ దుయ్యబట్టారు. 2017 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకున్నారు. అయితే బిజెపి వీరిని భారీ మెజారిటీతో ఓడించింది.