Sunday, September 29, 2024
HomeUncategorizedతన భర్తను అంతమొందించేందుకు బిజెపి కుట్ర

తన భర్తను అంతమొందించేందుకు బిజెపి కుట్ర

Date:

తన భర్తను తీహార్ జైలులో అంతమొందించేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఆప్ చీఫ్ తీసుకునే భోజనాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్ని పసిగట్టేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారని ఢిల్లీ సీఎం కదలికలను అధికారులు పసిగడుతున్నారని ఆమె ఆరోపించారు.

కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్ని పర్యవేక్షిస్తున్నారని, ఇది సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు. మధుమేహంతో బాధపడుతూ 12 ఏండ్ల నుంచి రోజూ ఇన్సులిన్ తీసుకుంటున్న కేజ్రీవాల్‌కు జైల్‌లో ఇన్సులిన్‌ను నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ సీఎంను చంపేయాలని వారు కోరుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాంచీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీని ఉద్దేశించి సునీతా కేజ్రీవాల్ మాట్లాడారు.