ఢిల్లీ లిక్కర్ విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. డయాబెటిక్తో బాధపడుతున్న ఆయనకు కస్టడీలో షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపించాయి.
చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒక దశలో షుగర్ లెవల్ 46ఎంజీ స్థాయికి పడిపోయింది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు” అని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుముందు కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా తన వీడియో సందేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ”ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కలిసినప్పుడు షుగర్ లెవల్స్ పడిపోతున్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం” అని అన్నారు. కేజ్రీవాల్ కస్టడీ గురువారం (మార్చి 28)తో ముగియనుంది. రేపు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆ సమయంలో కేసు గురించి నిజాలన్నీ సీఎం బయటపెడతారని సునీత తెలిపారు. మద్యం కేసులో డబ్బుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, తన అరెస్టును సవాల్ చేస్తూ సీఎం దాఖలు చేసిన పిటిషన్పై దిల్లీ హైకోర్టు నేడు విచారణ జరుపుతోంది.