Sunday, September 29, 2024
Homeక్రైంఆరు నెలల గర్భవతిని దారుణంగా చంపిన భర్త

ఆరు నెలల గర్భవతిని దారుణంగా చంపిన భర్త

Date:

ఆరు నెలల గర్భవతి ఐనా భార్యను మంచానికి కట్టేసి అత్యంత దారుణంగా భర్త కాల్చి చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటుచేసుకున్నది. అమృత్‌సర్‌కు సమీపంలోని బుల్లెనంగల్‌కు చెందిన పింకీ, సుఖ్‌దేవ్‌ భార్యాభర్తలు. పింకి ఆరు నెలల గర్భవతి. దంపతుల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం రాత్రి కూడా వాదులాట జరిగింది. ఇద్దరు ఒకరినొకరు మాటలు అనుకోవడంతో.. కోపోద్రిక్తుడైన సుఖ్‌దేవ్‌ గర్భవతి అనికూడా చూడకుండా పింకీని మంచానికి కట్టేశాడు. ఆవేశంలో ఆమెకు నిప్పంచడంతో సజీవదహణమయింది. అనంతరం సుఖ్‌దేవ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. శనివారం రాత్రి నిందితుడని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదే విషయమై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని పంజాబ్‌ డీజీపీని కోరింది. మూడు రోజుల్లోగా నిందితుడిని పట్టుకోవాలని, శిక్ష పడేలా చేయాలని స్పష్టంచేసింది.