మధ్యప్రదేశ్లోని దామో సీటుపై రాజకీయ పోటీని ఆసక్తికరంగా మార్చింది. స్వతంత్ర అభ్యర్థిగా దుర్గా ఆంటీ నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా స్కూటర్పై దుర్గా ఆంటీ ప్రచారం చేస్తోంది. ఆమె దామోహ్ లోక్సభ నియోజకవర్గంలో ప్రతిరోజూ 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రాత్రి కాగానే, దుర్గా ఆంటీ అక్కడే విశ్రాంతి తీసుకుంటుంది.
మధ్యప్రదేశ్లోని 29 లోక్సభ స్థానాల్లో, కేవలం దామోహ్ స్థానంలో మాత్రమే ట్రాన్స్జెండర్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. కట్ని నివాసి దుర్గా ఆంటీ దామోహ్ నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నామినేషన్లో దుర్గా ఆంటీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆమె వయస్సు 36 ఏళ్లు. ఇండియా పీపుల్స్ అధికార పార్టీ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు.