Sunday, September 29, 2024
HomeUncategorizedప్రభుత్వ సలహాదారులు రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలి

ప్రభుత్వ సలహాదారులు రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలి

Date:

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సలహాదారులకు ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సలహాదారులు కార్యనిర్వహక ఉత్తర్వులతో నియమితులై కేబినెట్ మంత్రుల హోదా ఉన్నందున మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు వారికి వర్తిస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నిలక సంఘం నుంచి మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనపై వివిధ ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు జారీ చేసింది.

వివిధ ఫిర్యాదుల నేపథ్యంలో.. ప్రభుత్వ సలహాదారులు వారు నిర్దేశించిన పని చేయకుండా రాజకీయ ప్రచారాలకు పాల్పడుతున్నారని, ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని ఎన్నికల సంఘం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని మొత్తం 40 మంది సలహాదారులు కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నియమించబడ్డారని, కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారని, అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి వేతనాలు, అలవెన్సులు తీసుకుంటున్నారని.. వారికి ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మంత్రుల మాదిరే వీరికి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందనితెలిపింది.

తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే.. మోడల్ కోడ్, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.